ఘ‌జియాబాద్ నుంచి ఘాజిపూర్ వ‌ర‌కు బీజేపీ తుడిచిపెట్టుకుపోతుంది

ఘ‌జియాబాద్ నుంచి ఘాజిపూర్ వ‌ర‌కు బీజేపీ తుడిచిపెట్టుకుపోతుంది

లక్నో: ఘజియాబాద్ నుంచి ఘాజిపూర్ వరకు బీజేపీ కొట్టుకుపోతుందని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అన్నారు. మరో రెండు రోజుల్లో లోక్సభ తొలి దశ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో కలిసి ఆ సమావేశాన్ని నిర్వహించారు. బీజేపీ చేసిన ప్రతి ప్రామిస్ ఉత్తదే అని తేలిందన్నారు. అయితే పశ్చిమం నుంచి వీస్తున్న గాలి.. తొలి దశ ఎన్నికల్లో దేశాన్ని మార్చనున్నట్లు అఖిలేశ్ యాదవ్ తెలిపారు. ఇవాళ మేం ఘజియాబాద్లో ఉన్నామని, ఇక ఈసారి ఇండియా కూటమి ఘజియాబాద్ నుంచి ఘాజీపూర్ వరకు తుడిచి వేస్తుందని, రైతులు చాలా నిరాశలో ఉన్నారని, బీజేపీ చేసిన వాగ్ధానాలు అసత్యం అని తేలినట్లు అఖిలేశ్ యాదవ్ తెలిపారు. యూపీలో పశ్చిమ దిశలో ఉన్న ఘజియాబాద్లో ఏప్రిల్ 26వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఇక తూర్పులో ఉన్న ఘాజిపూర్లో జూన్ ఒకటో తేదీన ఎన్నికలు జరగనున్నాయి. వెనుకబడిన వారు, దళితులు, అల్పసంఖ్యాకులు.. అందరూ కలిసి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏను ఓడిస్తారని ఆయన అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos