కాంగ్రెస్​ పార్టీకి ఐటీ శాఖ మరో షాక్

కాంగ్రెస్​ పార్టీకి ఐటీ శాఖ మరో షాక్

న్యూఢిల్లీ:ప్రతిపక్ష కాంగ్రెస్కు రూ.1700 కోట్ల పన్నుకు సంబంధించి ఆదాయపు పన్నుశాఖ మరోమారు నోటీసులు జారీ చేసిందని కాంగ్రెస్ నేత వివేక్ తంఖా శుక్రవారం వెల్లడించారు. 2017-18, 2020-21 మదింపు సంవత్సరాలకు సంబంధించి జరిమాన, వడ్డీ రూ.1700 కోట్లు చెల్లించాలని కోరిందన్నారు. ఇదే అంశంపై ఐటీ విభాగం ప్రక్రియను నిలిపివేయాలంటూ పార్టీ వేసిన పిటిషన్ను దిల్లీ హైకోర్టు కొట్టేసిన మరుసటి రోజే ఈ పరిణామం జరగడం చర్చనీ యాంశం.ఎలాంటి మదింపు ఉత్తర్వులు, పత్రాలు లేకుండానే గురువారం తాజా నోటీసులిచ్చినట్లు వివేక్ తంఖా విమర్శించారు. ఇది అహేతుక, అప్రజాస్వామిక చర్య అని మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల వేళ ప్రధాన ప్రతిపక్షాన్ని ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసేందుకు కేంద్రం ప్రయత్ని స్తోందని అన్నారు. దీనిని తాము చట్టపరంగా సవాల్ చేస్తామని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos