గెహ్లాట్ పై చర్యలు తీసుకోవాలి

గెహ్లాట్ పై చర్యలు తీసుకోవాలి

న్యూ ఢిల్లీ : రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక గెహ్లాట్ పై చర్యలు తీసుకోవాలని పార్టీ ఎన్నికల అధికారికి అధ్యక్ష పదవకి పోటీ పడుతున్నా ఎంపి శశి థరూర్ ఫిర్యాదు చేసారు. ‘పార్టీ నేతలు, కార్యకర్తలతో ఖర్గే మంచి సంబంధాలను కలిగి ఉన్నారు. విపక్ష నేతలతో కూడా చర్చించగలిగే సామర్థ్యం ఖర్గేకు ఉంది. కాబట్టి ఆయనను మనందరం గెలిపిం చాల’ ని గెహ్లాట్ వీడియో సందేశంలో పిలుపు నివ్వటం ఫిర్యాదుకు కారణం. ‘ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. పార్టీ పదాధికార్లు, ముఖ్యమంత్రులు, పీసీసీ చీఫ్ లు ఏ అభ్యర్థి తరపున ప్రచారంలో పాల్గొనరాదు. మద్దతును ప్రకటించరాదు’అని థరూర్ వివరించారు. దీనిపై కాంగ్రెస్ ఎన్నికల అధికార యంత్రాం గం దర్యాప్తు చేసి గెహ్లాట్ పై చర్యలు తీసుకోవాలన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos