దేశవ్యాప్తంగా హై అల‌ర్ట్

దేశవ్యాప్తంగా హై అల‌ర్ట్

న్యూ ఢిల్లీ : అగ్నిపథ్ కు వ్యతిరేకంగా దేశంలో ఆందోళనలు మరింతగా పెరుగుతున్నాయి. భారత్ బంద్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్ కొనసాగుతోంది. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా నిరసనల మధ్య భారత్ కిసాన్ యూనియన్ రైతు నాయకుడు రాకేష్ టికాయత్ పెద్ద హెచ్చరిక జారీ చేశారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దేశ రాజధానికి వెళ్లే మార్గం చూసినందున నాలుగు లక్షల ట్రాక్టర్లు ఢిల్లీలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. మరోసారి లక్షలాది ట్రాక్టర్లు, నిరసన కారులు దేశ రాజధానికి ఢిల్లీలోకి ప్రవేశిస్తే.. పరిస్థితులు దారుణంగా మారే అవకాశముండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సరిహద్దులో భారీగా బలగాలను మోహ రిస్తున్నారు. అగ్నిపథ్ స్కీమ్ను ప్రవేశపెట్టాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ, దీనిని పెద్ద ఉద్యమంగా మార్చాలని దేశ ప్రలకు పిలపునిచ్చారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు 90 ఏళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేసి పెన్షన్ పొందవచ్చని, అయితే సైన్యంలో చేరి దేశాన్ని రక్షించే వారికి పెన్షన్ లేకుండా పోతుందని, అగ్నిపథ్ పథకానికి ప్రభు త్వం విధించిన వయో పరిమితిని టికాయత్ తప్పుబట్టారు. సీనియర్ అధికారులు సింఘూ సరిహద్దు, తిక్రీ సరిహద్దు, బదర్పూర్ సరిహద్దు మరియు ఘాజీపూర్ సరిహద్దు ల్లో కట్టు దిట్టమైన భద్రతా తనిఖీలు చేశారు. బీహార్, ఉత్తర ప్రదేశ్, హర్యానా ల్లో అనేక ఆంక్షలు విధించారు. కొన్ని నగరాల్లో ఎస్ఎంఎస్, ఇంటర్నెట్ సేవలపై నియంత్రణకు చర్యలు తీసుకున్నారు. పలు నగరాల్లో సెక్షన్ 144 కూడా విధించారు. అగ్నిపథ్ కు వ్యతిరేకంగా విమర్శలు వెల్లువెత్తాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos