మోదీజీ మహిళల రక్షణపై దృష్టి పెట్టండి…

మోదీజీ మహిళల రక్షణపై దృష్టి పెట్టండి…

నాగాలాండ్ : ‘మోదీజీ ఆవుల కంటే ముందు మహిళల రక్షణపై దృష్టి పెట్టండి’ అని ఒక అందాల పోటీలో అభ్యర్థి చెప్పిన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నాగాలాండ్‌లో ‘మిస్ కోహిమా 2019’ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో భాగంగా న్యాయమూర్తులు వికునావో సచు అనే 18 ఏళ్ల యువతిని ‘ప్రధాన మంత్రికి మీరిచ్చే సలహా ఏమిటీ?’ అని న్యాయ నిర్ణేతలు ప్రశ్నించారు. దానికి ఆ యువతి ‘ముందు మీరు మహిళలపై దృష్టి పెట్టండి, తరువాత ఆవుల గురించి పట్టించుకోండి ’ అని ఆమె సమాధానం చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీనిని సోషల్ మీడియాలో ఉంచిన కొద్ది సేపటికే దాదాపు 60 వేల మందికి పైగా వీక్షించారు. కొన్ని వేల లైక్‌లు వచ్చాయి. ఈ పోటీలో సచు మూడో స్థానంలో నిలిచారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos