ఆమంచర్ల స్పోర్ట్స్ కాంప్లెక్స్ పనులను వేగవంతం చేయండి

ఆమంచర్ల స్పోర్ట్స్ కాంప్లెక్స్ పనులను వేగవంతం చేయండి

నెల్లూరు: ఆమంచర్ల క్రీడా గ్రామ నిర్మాణ పనుల్ని ఖేలో ఇండియా పథకం కింద వేగవంతంగా చేపట్టాలని ఆదాల ప్రభాకర్ రెడ్డి గురువారం లోక్సభలో కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు. మూడేళ్ల కిందట మంజూరైన ఈ పథకం పనులు సక్రమంగా జరగటం లేదని తెలిపారు. దీనికి కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజుజూ సానుకూలంగా స్పందించారు.‘ఖేలో ఇండియా పథకం అమలు బాధ్యత కేవలం కేంద్ర ప్రభుత్వానిదే కాదు. రాష్ట్ర ప్రభుత్వానికీ ఉంది. క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికి తీసి దేశానికి ఉపయోగపడే విధంగా వారిని తీర్చిదిద్దేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు రెండు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. త్వరలో ఆమంచర్ల క్రీడా గ్రామ నిర్మాణాల్ని వేగమంతం చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామ’ని బదులిచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos