గుజరాత్ ఎన్నికల్లో దిగొద్దని బీజేపీ ఆఫర్ చేసింది

గుజరాత్ ఎన్నికల్లో దిగొద్దని బీజేపీ ఆఫర్ చేసింది

న్యూ ఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయవద్దని బీజేపీ తనను కోరిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. అలాగైతే తన మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్లపై ఉన్న అన్ని అభియోగాలను ఎత్తేస్తామని ఆఫర్ చేశారనీ
ఎన్డీటీవీ ముఖాముఖిలో వెల్లడించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నుంచి తప్పుకుంటే ఢిల్లీ మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్లను దర్యాప్తు సంస్థల నుంచి, అన్ని అభియోగాల నుంచి బయటవేస్తామని ఆఫర్ చేశారని అన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రెండింటిలోనూ లోనూ ఓటమి తప్పదని బీజేపీ భయపడుతోందన్నారు. ‘ఆప్ను విడిచి పెడితే ఢిల్లీకి సీఎం చేస్తామని వారు మనీష్ సిసోడియాకు ఆఫర్ చేశారు. ఆ ఆఫర్ను మనీష్ సిసోడియా తిరస్కరించటంతో నేరుగా నన్నే కలిసారు. గుజరాత్ సెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుంటే ఢిల్లీ మంత్రులు సత్యేందర్ జైన్, మనీష్ సిసోడియాలపై ఉన్న అభియోగాలు అన్నింటిని ఎత్తేస్తామని ఆఫర్ చేశార’ని వివరించారు. ప్రలోబ పరచిన వారి పేర్లు బయటపెట్టడానికి నిరాకరించారు. ‘నేను నా మనిషి పేరునే ఎలా బయటపెట్టగలను. ఈ ఆఫర్ నా మనిషి ద్వారానే వచ్చింది. వారు (బీజేపీ) నేరుగా ఎవరినీ అప్రోచ్ కారు. వారు ఒకరి నుంచి మరొకరు.. అక్కడి నుంచి ఇంకొకరు అలా టార్గెట్ చేసిన వ్యక్తి వద్దకు చేరుకుంటారు. ఇదే రీతిలో ఆ సందేశాన్ని వారికి పంపిస్తార’న్నారు. గుజరాత్లో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని విశ్వాసాన్ని ప్రకటించారు. 182 స్థానాల గుజరాత్ అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కేవలం ఐదు సీట్లకే పరిమితం అవుతుందని జోస్యం చెప్పారు. ఈ రాష్ట్రంలో ఆప్ ఇప్పటికే నెంబర 2 స్థానంలో ఉన్నదని వివరించారు. కాంగ్రెస్ కంటే కూడా ముందంజలో ఉన్నదని తెలిపారు. మరో నెలలో తాము బీజేపీని మించి ముందుకు దూసుకెళ్లుతామని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos