క్విట్ ఇండియా ఉద్యమం లాంటి ఉద్యమం అవసరం

న్యూ ఢిల్లీ : క్విట్ ఇండియా ఉద్యమం లాంటి ‘డూ ఆర్ డై’ ఉద్యమం అవసరం ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం సందర్భంగా రాహుల్ గాంధీ ఫేస్బుక్లో తన అభిమతాన్ని ప్రకటించారు.‘ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు మరో ఉద్యమం అవసరం ఎంతైనా ఉంది. అన్యాయానికి వ్యతిరేకంగా గళమెత్తాల్సిన సమయం ఆసన్నమైంది. పెరిగిపోతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణాన్ని దేశం నుంచి తరిమి కొట్టాలి. నియంతృత్వ ప్రభుత్వాన్ని సాగనంపాలి. క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణ త్యాగం చేసిన ప్రతి ఒక్కరికీ నివాళులు అర్పిస్తున్నా’నన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos