రెబల్ ఎమ్మెల్యేల హోటల్ వద్ద టిఎంసీ ఎమ్మెల్యేల ఆందోళన

రెబల్ ఎమ్మెల్యేల హోటల్ వద్ద టిఎంసీ ఎమ్మెల్యేల ఆందోళన

ముంబై : మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం లోకి తృణమూల్ కాంగ్రెస్ అనూహ్యంగా రంగప్రవేశం చేసింది. గువహటిలో శివసేన రెబల్ ఎమ్మెల్యేలు బస చేస్తున్న ‘రాడీసన్ బ్లూ’ హోటల్ వద్ద హై డ్రామా నెలకొంది. హోటల్ వెలుపల తృణమూల్ కాంగ్రెస్కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పెద్దఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. శివసేన ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసిందని నినదించారు. అసోం రాష్ట్రం వరదల్లో చిక్కుకున్న వేళ బీజేపీ రాజకీయాల్లో మునిగిపోయిందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. రెబల్ ఎమ్మెల్యేలు బసచేస్తున్న ‘రాడీసన్ బ్లూ’ హోటల్ను అసోం బీజేపీ మంత్రి అశోక్ సింఘాల్ సందర్శించారు. అక్కడి వసతి సౌకర్యాలను పర్యవేక్షించారని పలు రిపోర్టులు వెలువడని దశలో తృణమూల్ నిరసనలు మొదలయ్యాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos