హైదరా బాదు: విజయదశమి సందర్భంగా ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన ప్రసంగంలో అబద్ధాలు చెప్పారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. సగం సత్యాలు, సగం అసత్యాలు చెప్పారని దుయ్యబట్టారు. ‘ముస్లింల జనాభా పెరగలేదు. తగ్గుతోంది. క్రిస్టియన్ల జనాభా పెరిగిందనే వ్యాఖ్యల్లో కూడా నిజం లేదు. జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేయడం వల్ల అక్కడి ప్రజలు ప్రయోజనాలు పొందుతున్నారన్న మాటల్లో నిజం లేదు. కశ్మీర్ లో ఎన్నో పౌర హత్యలు జరిగాయి. ఇంటర్నెట్ నిలిపివేత, సామూహిక నిర్బంధాలు సర్వ సాధా రణ మయ్యాయ’ని విమర్శించారు.