ప్రజావాహిని-బెంగళూరు
రాష్ట్ర గీతం స్వర రచన, దాన్ని పాడే వ్యవధి గురించి వచ్చే నెల రెండో తేదీన అధికారికంగా ప్రకటించనున్నట్లు కన్నడ, సంస్కృతి మంత్రి సునిల్ కుమార్ వెల్లడించారు. మంగళవారం విధాన సభ శూన్య వేళలో భాజపా సభ్యుడు కుమారస్వామి ప్రస్తావించిన అంశానికి ఈ మేరకు బదులిచ్చారు. చాలా కాలంగా రాష్ట్ర గీత స్వర రచన, దాన్ని పాడే వ్యవధి గురించి చాలా కాలంగా వాద, వివాదాలు సాగుతున్నందున పరిష్కరించాలని కుమారస్వామి కోరారు. ఆ పాట స్వర రచన , పాడే వ్యవధి గురించి సమగ్ర నివేదిక సమర్పించాలని కవి దొడ్డ రంగేగౌడ అధ్యక్షతన సమితిని గత తొమ్మిదిన ఏర్పాటు చేసినట్లు సునిల్ కుమార్ వివరించారు.