న్యూ ఢిల్లీ : పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామాకుi కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఆదేశించినట్లు తెలిసింది. దీనికి సింగ్ వ్యతిరేకంగా స్పందించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తనను అవమానిస్తున్నందు వల్ల తాను పార్టీకి రాజీనామా చేస్తానని ఆయన పార్టీ అధినేత సోనియాగాంధీకి చెప్పారని తెలిసింది. కెప్టెన్ అమరీందర్ సింగ్ సహచరుడు, పీసీసీ మాజీ చీఫ్ సునీల్ జక్కర్ను సింగ్ వారసుడుగా ఎంపిక చేసే అవకాశం ఉంది.