దేశ్ కే మెంటర్స్ ప్రచార కర్తగా సోనూసూద్

దేశ్ కే మెంటర్స్ ప్రచార కర్తగా సోనూసూద్

న్యూ ఢిల్లీ: తమ ప్రభుత్వం కొత్తగా అమలు చేయనున్న ‘దేశ్ కే మెంటర్స్’ పథకానికి సోనూసూద్ ను ప్రచార కర్తగా నియమించినట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్ర వారం ఇక్కడ విలేఖరులకు తెలిపారు. ‘లక్షలాది మంది విద్యర్థులకు మార్గదర్శకత్వం వహించే అవకాశం నాకు ఈ రోజు లభించింది. విద్యార్థులకు నిర్దేశం చేయడం కంటే గొప్ప సేవ ఇంకేమీ ఉండదు. ముఖ్యమంత్రితో కలిసి ఈ పథకం లక్ష్యాన్ని నెరవేరుస్తాను. లాక్ డౌన్ ప్రారంభమైనప్పుడు, అనేక మందితోతో నేను మమేకమయ్యా. విద్య ప్రధాన అంశం. విద్యార్థులకు భవిష్యత్తుల్లో ఏమి చేయాలో అవగాహన ఉండనప్పుడు, కుటుంబంలో ఎవరూ చెప్పేగలిగే పరిస్థితిలో లేనప్పుడు వారి పరిస్థితి ఏమిటి? అలాంట ప్పుడు ఎవరో ఒకరు విద్యా ర్థులకు మార్గదర్శకం కావాలి. దేశ్ కే మెంటర్స్ ఇందుకు ఉద్దేశించి నదేన’ని సోనూసూద్ తెలిపారు. ‘నిరంతరం మంచి పనులు చేయా లంటే మీరు రాజకీయాల్లోకి రావాలని చాలామంది అంటుంటారు. మంచి పనులు చేయడానికి రాజకీయాలే అవసరం లేదు. నాకు అలాంటి అవకాశాలు వస్తూనే ఉన్నా యి. వాటి గురించి ఎప్పుడూ ఆలోచించ లేదు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్తో కూడా రాజకీయాల గురించి మాట్లాడలేద’ని సోనూసూద్ సమాధానమిచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos