వికాస్​ కేసును సీబీఐకి అప్పగించాలి

వికాస్​ కేసును సీబీఐకి అప్పగించాలి

న్యూ ఢిల్లీ: గూండా వికాస్ దూబే కేసులో సీబీఐ విచారణ జరిపించి వాస్తవాలను వెలుగులోకి తేవాలని కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ కోరారు. ‘కాన్పుర్ ఎదురు కాల్పుల్లో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఎనిమిది మంది పోలీసుల్ని బలిగొన్న నిందితులను తక్షణమే పట్టుకోలేకపోయారు. పటిష్ట భద్రత ఉన్నప్పటికీ నేరగాడు ఉజ్జయిని ఎలా చేరుకున్నాడు. ఇది భద్రతపై అనుమానాలు రేకెత్తిస్తోంది. ఈ కేసులో ఇంకా చాలా విషయాలు దాగున్నాయ’ని వ్యాఖ్యా నించారు. ‘అతడే లొంగిపోయాడో స్పష్టతనివ్వాల’ని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ డిమాండు చేశారు. అతని కాల్ డేటా బయటకుతీసి నపుడే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ట్వీట్ చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos