తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొద్ది కాలానికే స్టార్ హీరోలతో నటించే అవకాశాలు దక్కించుకొని స్టార్హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న సమంత వివాహం అనంతరం కేవలం లేడీ ఒరియెంటెడ్ చిత్రాల్లో మాత్రమే నటిస్తోంది.గత రెండు మూడేళ్లుగా రంగస్థలం మినహా సమంత నటించిన చిత్రాలన్నీ లేడీ ఒరియెంటెడ్ చిత్రాలే.అయితే సమంత నటించిన చిత్రాలన్నీ వసూళ్లు సాధించలేక చతికిలబడడంతో సమంత మార్కెట్ కూడా పడిపోయింది.దీంతో పోయిన క్రేజ్,మార్కెట్ను మళ్లీ తెచ్చుకోవడానికి ఇతర హీరోయిన్ల అవకాశాలపై కన్నేసినట్లు చర్చలు జరుగుతున్నాయి.అందులో భాగంగా త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కనున్న కొత్త చిత్రంలో హీరోయిన్గా ఎంపికైనట్లు తెలుస్తోంది.అయితే ఈ అవకాశం సమంత మార్కెట్ చూసో లేక అందం,అభినయం చూసో రాలేదట.త్రివిక్రమ్,ఎన్టీఆర్తో ఉన్న పరిచయాలు తనకున్న నేపథ్యాన్ని ఉపయోగించుకొని అవకాశం దక్కించుకుందట.ఈ చిత్రంలో ముందుగా హీరోయిన్గా రష్మిక మందన్నను అనుకోగా మధ్యలో ప్రవేశించిన సమంత తారక్,త్రివిక్రమ్ను ఒప్పించి అవకాశం దక్కించుకుందని టాక్.