హొసూరు : తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను ముప్పతిప్పలు పెట్టిన అడవి దొంగ వీరప్పన్ కూతురు విద్యారాణి భాజపా తీర్థం పుచ్చుకుంది. క్రిష్ణగిరిలో శనివారం జరిగిన సమావేశంలో వివిధ పార్టీలకు చెందిన వారు భాజపాలో చేరారు. ఈ సమావేశంలో పార్టీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కూతురు విద్యారాణి న్యాయవాది. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి రాధాకృష్ణన్, పార్టీ నాయకులు నరేంద్ర, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.