రాంచీ: లోహర్డగా పట్టణంలో శుక్రవారం కర్ప్యూ విధించారు. నూతన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా అక్కడ గురువారం జరిగిన ప్రదర్శనలో ఘర్షణలు సంభవించాయి. రెండు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది. అల్లర్లు జరిగేందుకు అవకాశాలున్న ప్రదేశాలకు అదనపు బలగాలను తరలించామన్నారు.