అమరావతి: రాష్ట్రంలో గత 24 గంటల్లో 61 కరోనా కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ శనివారం ఇక్కడ ప్రకటించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 1016కు చేరింది. కరోనా మృతుల సంఖ్య 31కి చేరింది. ఇప్పటి వరకు 171 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి విడుదలయ్యారు. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 814 మంది చికిత్స పొందుతున్నారు. గుంటూరు జిల్లాలో అత్యధికంగా ఇప్పటి వరకు 209 కేసులు నమోదయ్యాయి. దరిమిలా గుంటూరులో మరింత పకడ్బంధీగా లాక్డౌన్ అమలు చేస్తున్నారు.