హైదరాబాద్ వన్డేకు భారీ భద్రత

  • In Sports
  • February 28, 2019
  • 773 Views
హైదరాబాద్ వన్డేకు భారీ భద్రత

హైదరాబాద్ : భారత, ఆసీస్ల మధ్య అయిదు వన్డేల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ శనివారం ఇక్కడి ఉప్పల స్టేడియంలో జరుగనున్నందున, పోలీసులు భారీ భద్రతా చర్యలు చేపట్టారు. గురువారం స్టేడియంను, పరిసరాల్లో పార్కింగ్ ప్రదేశాలను తమ స్వాధీనంలోకి తీసుకున్నట్లు రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. మ్యాచ్‌ను 38 వేల మంది ప్రేక్షకులు తిలకిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తామన్నారు. 200 సీసీ కెమెరాలు, చెక్ పాయింట్లు, స్కానర్లు, బాంబు స్క్వాడ్ టీమ్తో 24 గంటలు పహరా కాస్తున్నట్లు పేర్కొన్నారు. ఈవ్ టీజర్ల భరతం పట్టేందుకు స్టేడియం పరిసరాల్లో షీ టీమ్లు అప్రమత్తంగా ఉన్నాయన్నారు. అధిక ధరలకు తినుబండారాలు విక్రయించే వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక వెండర్ సూపర్ వైజింగ్ టీమ్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచే ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతిస్తామన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos