ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు

ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు

హైదరాబాద్‌: తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు పడింది. తెరాస నుంచి శాసనమండలికి ఎన్నికైన భూపతిరెడ్డి, రాములు నాయక్‌, యాదవరెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరారని తెరాస నేతలు మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో పాటు కొన్ని ఆధారాలను కూడా సమర్పించడంతో వాటిని పరిశీలించిన మండలి ఛైర్మన్‌ నోటీసులు జారీ చేసి ..ముగ్గురు ఎమ్మెల్సీల వాదన విన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న మండలి ఛైర్మన్‌ ..  భూపతిరెడ్డి, రాములు నాయక్‌, యాదవరెడ్డిపై అనర్హత వేటు వేస్తూ ఇవాళ నిర్ణయం తీసుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos