డోర్నకల్ మండలంలో ఎమ్మెల్యే రెడ్యానాయక్ సర్పంచ్ అభ్యర్థులను నిలపగా వారికి వ్యతిరేకంగా పోటీచేస్తున్న అభ్యర్థులను, ప్రచారం చేస్తున్న నాయకులను టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ మండలాధ్యక్షుడు గొర్ల సత్తిరెడ్డి తెలిపారు. డోర్నకల్లో ఆయన ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పోటీలో ఉన్న బూరుగుపాడు గ్రామానికి చెందిన సర్పంచ్ అభ్యర్థి కొల్లేటి సరస్వతి, రవీందర్, అనంత్రెడ్డి, ఎన్. దామోదర్రెడ్డి, వెంకటరెడ్డి, కె.శ్రీను, రాముతండాకు చెందిన గుగులోతు రెడ్డి, మాజీ సర్పంచ్ సావిత్రి, వెన్నారం గ్రామానికి చెందిన శెట్టి వెంకన్న, మోదుగడ్ల తండాకు చెందిన మాజీ వైస్ ఎంపీపీ గుగులోతు వెంకన్న, నరేష్, వీరన్న, ధరావత్ రాజు, బుజ్జిబాబులను పార్టీనుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ రెబల్ అభ్యర్థులుగా పోటీచేస్తున్నవారు ఎమ్మెల్యే రెడ్యానాయక్, సీఎం కేసీఆర్ ఫోటోలను వాల్పోస్టర్లో, ఫ్లెక్సీల్లో వాడుకుంటే వెంటనే తొలగించాలని, లేనియెడల చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో మేకపోతుల శ్రీనివాస్ గౌడ్, కేశబోయిన కోటిలింగం, వాంకుడోతు వీరన్న, కొత్త వీరన్న, ధారావతు కృష్ణ పాల్గొన్నారు.