ప్రస్తుతం మార్కెట్లో మనకు ద్రాక్షల్లో అనేక రకాల ద్రాక్షలు అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా తమకు నచ్చిన రకానికి చెందిన ద్రాక్షలనే కొని తింటుంటారు. అయితే ప్రధానంగా ఎరుపు రంగు ద్రాక్ష పండ్లను తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఇతర రంగు ద్రాక్షల కన్నా ఎరుపు రంగు ద్రాక్షల్లోనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్ వల్ల శరీర కణజాలం నాశనం కాకుండా రక్షిస్తాయి.
2. ఎరుపు రంగు ద్రాక్షలను తినడం వల్ల శరీరంలో ఉండే వాపులు పోతాయి. అధిక బరువు తగ్గుతారు. కీళ్ల నొప్పులు, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. వయస్సు మీద పడడం కారణంగా వచ్చే అల్జీమర్స్ వ్యాధి రాకుండా అడ్డుకోవచ్చు.
3. ఎరుపు రంగు ద్రాక్షలను నిత్యం తింటే రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. దీని వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
4. నిత్యం ఎరుపు రంగు ద్రాక్షలను తింటుంటే రక్త సరఫరా మెరుగు పడుతుంది. కంటి చూపు పెరుగుతుంది.
5. డయాబెటిస్ ఉన్నవారు ఎరుపు రంగు ద్రాక్షలను తినడం మంచిది. దీంతో వారి రక్తంలో షుగర్ స్థాయిలు తగ్గుతాయి.