గుంటూరు: ఈవీఎంలపై అనుమానం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ జీహెచ్ఎంసీ, తెలంగాణ ఎన్నికల్లో కేటీఆర్ చెప్పిన ఫలితాలే టీఆర్ఎస్కు వచ్చాయన్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్పై ఎన్ఐఏతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో జరపాలని వీహెచ్ తెలిపారు.