న్యూఢిల్లీ: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను ఆ దేశ సైన్యం చేతిలోని ‘టేప్ రికార్డర్’తో బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి పోల్చారు. ఇమ్రాన్తో చర్చలు జరపడం కంటే ఆ దేశ ఆర్మీ జనరల్తో చర్చలు జరపడమే మేలని వ్యాఖ్యానించారు. ‘ఇమ్రాన్ సైన్యం చేతిలోని టేప్ రికార్డర్ వంటి వ్యక్తి. ఆయనతో శాంతి చర్చలు జరపడంలో అర్థం లేదు. అంతకంటే పాక్ ఆర్మీ జనరల్తో చర్చలు జరపడమే మేలు’ అని శుక్రవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆయన అన్నారు.