సుక్మ:చత్తీస్ఘడ్ లో మావోయిస్టలు కంచుకోటగా పేరుగాంచిన దంతేవాడ, సుక్మా జిల్లాల సరిహద్దులో బుధవారం భీకర ఎదురు కాల్పులు సంభవించాయి. దంతేవాడ-సుక్మా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు నక్కినట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో పోలీసులు, సీఆర్పీఎఫ్ సంయుక్త బలగాలు గాలింపులు చేపట్టాయి. బలగాల కదలికలను పసి గట్టిన మావోయిస్టులు కాల్పులు జరిపారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరపటంతో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. భద్రతా సిబ్బందికి ఎలాంటి గాయాలు తగల్లేదని వివరించారు. మావోయిస్టుల నుంచి ఇన్సాఫ్ తుపాకీ, పేలుడు పదార్థాలు, మందు గుండు సామగ్రి, నిషేధిత సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం గాలింపును ముమ్మరం చేశామన్నారు