లాభాల్లో బ్యాంకింగ్ షేర్లు

లాభాల్లో బ్యాంకింగ్ షేర్లు

ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్ని గడించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 136 పాయింట్లు లాభపడి, 40,301 వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 54 పాయింట్లు ముందుకు కదిలి 11,945 వద్ద నిలిచాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 70.73 గా నమోదైంది. ఆరంభంలో సెన్సెక్స్ ఏకంగా 269 పాయింట్లు లాభంతో దూసుకెళ్లింది. మధ్యాహ్నం నుంచి మదుపరులు లాభాల్ని స్వీకరించటంతో లాభం చివరకు 136 పాయింట్లకు పరిమిత మైంది.ఆటో రంగ షేర్లు నష్టాల్ని చవి చూసాయి. భారతీ ఇన్ఫ్రాటెల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్, కోల్ ఇండియా, ఇన్ఫోసిస్ తదితర షేర్లు లాభ పడ్డాయి. జీ ఎంటర్టైన్మెంట్, ఐవోసీ, మారుతీ సుజుకీ, హీరో మోటో కార్ప్, ఇండస్ఇండ్ బ్యాంకు షేర్లు నష్టాల పాలయ్యాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos