అమరావతి: ఆంధ్రప్ర దేశ్ కొత్త శాసన సభ తాత్కాలిక సభాపతిగా బొబ్బిలి శాసన సభ్యుడు శంబంగి వెంకట చిన్న అప్పల నాయుడు నియమితులయ్యే అవకాశముంది. నాలుగు సార్లు వరుసగా ఆయన శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ నెల 12 నుంచి శాసనసభ సమావేశాలు ఆరంభం కానున్నాయి. సమావేశాల తొలి రోజు ఆయన ఎన్నికల విజేతలతో సన సభ్యులుగా ప్రమాణాల్ని చేయిస్తారు. తదుపరి నూతన సభాపతి ఎన్నిక జరుగుతుంది. ప్రస్తుత శాసనసభ్యుల్లో చంద్రబాబు నాయుడు 8సార్లు గెలిచారు. ఆయనే విపక్ష నేతగా వ్యవహరించనున్నారు. దరిమిలా ఆయన్ను తాత్కాలిక సభాపతిగా నియమించే అవకాశాల్లేవని భావిస్తున్నారు. వైకాపా సభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, కాటసాని రాం భూపాల్ రెడ్డి , తెదేపా సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరు సార్లు సభకు ఎన్నికయ్యారు.