అహ్మదా బాద్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ రహదారి ప్రదర్శన ముగించి సబర్మతి ఆశ్రమాన్ని చేరుకున్నారు. ప్రధాని స్వయంగా మోదీ ఆశ్రమ వివేషాల్ని ట్రంప్కు వివరించారు. ట్రంప్ అక్కడ చర్ఖాను తిప్పటంలో మోదీ మార్గదర్శనం చేసారు. మూడు బొమ్మ కోతుల ఆశయాల్ని వివరించారు. అంతకు ముందు. తెల్లని రంగు వాహనాలు ముందు నడుస్తుండగా, వాటి వెనకాల నల్లటి రంగులో ఉన్న ట్రంప్ వాహన శ్రేణి వాటిని అనుసరించింది. దారికి రెండు పులా ప్రజలు మువ్వన్నెల పతాకాలు, సంప్రదాయ నృత్యాలతో, వస్త్రధా రణతో ట్రంప్కు ఘన స్వాగతం పలికారు. రహదారులకు ఇరువైపులా ‘నమస్తే ట్రంప్’ అన్న నినాదాలతో ప్రజలు నినాదాలను హోరె క్కించారు. ఆయా రహదారుల కూడళ్లు, రోడ్డు కిరువైపులా ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ కటౌట్లు పెట్టారు. 22 కి.మీ.ల దూరం రహ దారి ప్రదర్శన సాగింది.