రాంచీ: ఝార్ఖండ్ శాసనసభ ఎన్నికల రెండో దశ పోలింగ్లో శనివారం గుమ్లా జిల్లాలోని సిసాయి నియోజకవర్గంలో36 పోలింగ్ కేంద్రం వద్ద భద్రతా సిబ్బంది నుంచి ఆయుధాలను లాక్కునేందుకు దుండగులు ప్రయత్నించారు. దీంతో భద్రతా సిబ్బంది వారిపై కాల్పులు జరపటంతో ఒక వ్యక్తి గాయపడ్డాడు. ఇతర ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఐదు దశల పోలింగ్లో భాగంగా శనివారం రెండో దశలో ఇరవై నియోజకవర్గాలకు ఎన్నికల జరుగుతోంది.