ఎడ్లు, గుర్రం, కోడి పందేలకు అనుమతిని ఇవ్వండి

ఎడ్లు, గుర్రం, కోడి పందేలకు అనుమతిని ఇవ్వండి

కాకినాడ: సంక్రాంతి, ఉగాది పండుగలకు ఎడ్లు, గుర్రం, కోడిపందేలు వంటి వాటిని నిర్వహించుకునేందుకు అనుమతిని ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ కు మాజీ మంత్రి, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు లేఖలో ఆయన కోరారు. సంక్రాంతి, ఉగాది ఉత్సవాల్లో గుర్రం, కోడి పందేలు, ఎడ్లు బరువు లాగే పోటీలు తదితర కార్యక్రమాలను ఐదు రోజుల పాటు జరుపుకోవడం ఆనవాయతీగా వస్తోందన్నారు. పండుగ ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వ ఆదేశాలతో పందేలను పోలీసులు అడ్డు కోవటం, ఆ తర్వాత చివర్లో అనుమతిస్తుండటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఐదు రోజుల పాటు అన్ని ఆటలకు పూర్తి స్థాయిలో అనుమతులను ఇవ్వాలని, పండుగల సంతోష సమయాల్లో జనాలను జైలుకు తీసుకెళ్లే పరిస్థితి రాకూడదని కోరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos