నేను జనం మనిషిని: మంచు మనోజ్

అమరావతి: తాను రాజకీయ పక్షాలకు అతీతంగా ప్రజల కోసం నిలబడే మనిషినని నటుడు మంచు మనోజ్‌ మంగళవారం ట్వీట్‌ చేసారు. ‘అందరికీ ఓ చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. నేను ఎప్పుడూ పార్టీలకు అతీతంగా ప్రజల కోసం నిలబడాలనుకునే మనిషిని. ఒక మనిషికి సాయం చేసేటప్పుడు తన కష్టం తప్ప కులం, మతం చూడకూడదని పూర్తిగా నమ్మే మనిషిని. ఫీజ్ రీయింబర్స్మెంట్ కోసం చేసిన దీక్షకి మద్దతుగా నేను నిలబడింది పిల్లల భవిష్యత్తు బాగుపడాలన్న ఉద్దేశంతోనే. ఎటువంటి రాజకీయ ప్రయోజనాల కోసం కాదని నేను మనస్ఫూర్తి’గా చెప్పగలను.‘మా కళాశాలపై తప్పుడు ఆరోపణల చేసిన తెదేపా కార్యకర్త పట్ల నేను కాస్త కఠినంగానే స్పందించా. అది మా నాన్నగారి కష్టార్జితంతో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొని కట్టిన కాలేజ్’ అంటూ వివరించారు. విద్యాని కేతన్ విద్యాసంస్థల ఫీజ్ రీయింబర్స్మెంట్ వివాదంలో ఓ తెదేపా కార్యకర్త ఒకరు చేసిన ఆరోపణలకు మనోజ్ కఠినంగా స్పందించటాన్ని నెటిజన్లు తప్పు బట్టారు. ఇష్టా రాజ్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనికి మనోజ్ ఈ మేరకు స్పందించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos