మ‌మ‌తా బెన‌ర్జీపై అనుచిత వ్యాఖ్య‌లు.. సారీ చెప్పిన దిలీప్ ఘోష్‌

మ‌మ‌తా బెన‌ర్జీపై అనుచిత వ్యాఖ్య‌లు.. సారీ చెప్పిన దిలీప్ ఘోష్‌

కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి.. ఆ రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత దిలీప్ ఘోష్ క్షమాపణలు తెలిపారు. మమతా బెనర్జీపై రెండు రోజలు క్రితం దిలీప్ ఘోష్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానిపై బీజేపీ పార్టీ ఆయన నుంచి వివరణ కోరింది. తన పార్టీలో తన వ్యాఖ్యల పట్ల అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయని, ఒకవేళ ఎవరినైనా ఇబ్బందిపెడితే, తాను సారీ చెబుతున్నట్లు దిలీప్ ఘోష్ తెలిపారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన దిలీప్పై టీఎంసీ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ఫిర్యాదు చేసింది. సీఎం దీదీతో తనకు ఎటువంటి వ్యక్తిగత శత్రుత్వం లేదని అన్నారు. మమతా బెనర్జీ చేసిన రాజకీయ ప్రకటనలను మాత్రమే తాను వ్యతిరేకించినట్లు దిలీప్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మమతా బెనర్జీ.. బెంగాల్కు స్థానిక వ్యక్తే కావాలని నినాదాన్ని ఎత్తుకున్నారు. దీనికి కౌంటర్గా ‘గోవాకు వెళ్లినప్పుడు తాను గోవా బిడ్డను అని చెప్తారు. త్రిపురలో త్రిపుర బిడ్డను అంటారు. ముందు ఆమె ఎవరి కూతురు అన్నదానిపై స్పష్టత ఇవ్వాలి’ అని ఘోష్ అసభ్య పదజాలాన్ని ఉపయోగించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos