ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి

ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి

విజయవాడ : ప్రకాశం బ్యారేజీకి సోమవారం కూడా వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ ఉన్న మున్నేరు, వైరా, కట్టలేరు, కీసర వాగుల నుంచి 60 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం బ్యారేజ్ లోకి 5 లక్షల 63 వేల క్యూసెక్కు నీరు చేరుతోంది. 5 లక్షల 60 వేల క్యూసెక్కుల నీరును వదలుతున్నాయి. సాగునీటి అవసరాలకుగాను కృష్ణా నది తూర్పు, పశ్చిమ కాల్వలకు 3 వేల క్యూసెక్కుల నీరు, పులిచింతల జలాశయం నుంచి 5 లక్షల క్యూసెక్కుల వంతున నీరు విడుదల చేశారు. లోతట్టు ప్రాంతల ప్రజలు ముంపులోనే అవస్థలుపడుతున్నారు. సోమ, మంగళ వారాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos