న్యూఢిల్లీ:రాజధానిలో సంభవిస్తున్న హింసాత్మక సంఘటనలపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మతం పేరుతో ప్రజలను విడదీయాలని ప్రయత్నించేవారిని ఉపేక్షించేదిలేదని, మహాత్మాగాంధీ పుట్టిన దేశంలో హింసకు తావులేదన్నారు. దేశ ప్రజలు మురీ ముఖ్యంగా ఢిల్లీ వాసులు మత అభ్యర్థించారు. సోమవారం సంభవించిన అల్లర్లలో మృతి చెందిన హెడ్కానిస్టేబుల్ రతన్లాల్ కుటుంబానికి సంతాపం తెలిపారు. ఢిల్లీ హింసాత్మక సంఘటనలు కలవర పెడుతున్నాయని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్గాంధీ ట్విటర్లో ఆక్రో శించారు. శాంతియుత వాతావరణంలో నిరసించటమే ఆరోగ్యకర ప్రజాస్వామ్యమన్నారు. అల్లర్ల వల్ల ఇప్పటి వరకూ ఏడు గురు మర ణించి నట్లు పోలీసులు తెలిపారు.