తలపై గ్రానైట్ పడి కార్మికుడి మృతి

తలపై గ్రానైట్ పడి కార్మికుడి మృతి

హోసూరు : ఇక్కడికి సమీపంలోని ప్రైవేట్ గ్రానైట్ కంపెనీలో తలపై గానైట్ రాయి పడి కార్మికుడు మృతి చెందాడు. డెంకనికోట సమీపంలోని దేవర ఉలిమంగలం గ్రామానికి చెందిన మునిరాజు హోసూరు సమీపంలోని గుండుగురికి గ్రామం వద్ద గల ప్రైవేట్ గ్రానైట్ కంపెనీలో గత ఎనిమిది సంవత్సరాలుగా పని చేస్తున్నాడు. మంగళవారం ఉదయం మునిరాజు కంపెనీలో విధులు నిర్వర్తిస్తుండగా ఆకస్మికంగా బండరాయి తలపై జారిపడింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన మునిరాజ్ ఘటనా స్థలంలోనే మరణించాడు. ఈ సంఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos