దుబాయ్: ప్రపంచకప్ సమీపిస్తోంది. ఐపీఎల్ ముగిసిన వెంటనే భారత జట్లు ఇంగ్లాండ్ వెళ్తుంది. ప్రస్తుతం న్యూజిలాండ్లో ఉన్న టీమిండియా టీ20 సిరీస్ తర్వాత స్వదేశానికి రానుంది. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్లో తలపడనుంది. మే 30 ప్రారంభమయ్యే ప్రపంచకప్ ముందు జట్లన్నీ రెండు అధికారిక వార్మప్ మ్యాచ్లు ఆడతాయి. మరి కోహ్లీసేన ఎవరెవరితో ఆడనుందో తెలుసా! భారత జట్టు మే 25న ఓవల్లో న్యూజిలాండ్తో మే 28న కార్డిఫ్లో బంగ్లాదేశ్తో తలపడనుంది. దాదాపు ఐదు రోజులు వార్మప్ మ్యాచ్లు కొనసాగుతాయి. మే 24 నుంచి 28 వరకు జరిగే వార్మప్ మ్యాచ్లకు బ్రిస్టల్ కౌంటీ మైదానం, కార్డిఫ్ వేల్స్ మైదానం, హాంప్షైర్ బౌల్, ది ఓవల్ ఆతిథ్యం ఇస్తాయని ఐసీసీ వెల్లడించింది. వార్మప్ మ్యాచ్లను స్థానిక ప్రేక్షకులు చూసి ఆస్వాదించొచ్చని వెల్లడించింది.