న్యూఢిల్లీ: చంద్రయాన్-2 ల్యాండర్ చంద్రుడి పై కుప్పకూలటం వల్ల మన దేశం అప్రతిష్ట పాలైందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు ఎంపీ సౌగతారాయ్ గురువారం లోక్ సభలో వ్యాఖ్యానించారు. దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతరిక్ష ప్రయోగాలకు అదనపు నిధులు కేటాయించదలచటం సరైన నిర్ణయం కాదన్నారు. ఈ వ్యాఖ్యలపై భాజపా సభ్యులు మండిపడ్డారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రయోగంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని మీనాక్షి లేఖి అన్నారు.