దశాబ్దానికి పైగా విరామం అనంతరం లేడీ సూపర్స్టార్ విజయశాంతి నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు చిత్రంపై ఇప్పటికే అంచనాలు ఓస్థాయిలో ఉండగా చిత్రబృందం సైతం ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేసింది.ఈ నేపథ్యంలో తన ఫేస్ బుక్ ఖాతాలో విజయశాంతి, ఓ పోస్ట్ ను పెట్టారు.
“మనం భారతీయులం
‘సరిలేరు మనకెవ్వరు’
సంప్రదాయంగా.. సంస్కృతి ధర్మపరంగా..
ఇది మన దేశం నేర్పిన విధానం
ఆ ఉన్నత విలువలతో కూడిన ఒక చక్కని సందేశాత్మక చిత్రంగా మీ ముందుకు వస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం టైటిల్ నెంబర్ నేటి సాయంత్రం 5.04 గంటలకు విడుదల కానుంది. జనవరి 5, 2020వ తేదీన ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుంది, ఈ సందర్భంగా మన సినిమాను అభిమానంతో స్వాగతిస్తున్న ప్రజలకు, అభిమానులకు గౌరవ అతిథులకు ధన్యవాదాలతో…
మీ
విజయశాంతి” అని పోస్ట్ పెట్టారు.
మనం భారతీయులంసరిలేరు మనకెవ్వరుసంప్రదాయంగా.. సంస్కృతి ధర్మపరంగా..ఇది మన దేశం నేర్పిన విధానంఆ ఉన్నత విలువలతో కూడిన…
Posted by Vijayashanthi on Sunday, December 22, 2019