విశాఖ: కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మరణంతో విశాఖ-విజయవాడ మధ్య నడవనున్న డబుల్ డెక్కర్ ఏసీ రైలు- ఉదయ్ ఎక్స్ప్రెస్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఈ నెల 26న రైల్వే శాఖ సహాయ మంత్రి సురేశ్ అంగడి దీన్ని ప్రారంభించాల్సి ఉంది. ఉదయం 5.45 గంటలకు విశాఖలో బయలుదేరనున్న రైలు ఉదయం 11.15 గంటలకు విజయవాడకు చేరుతుంది. అదే రోజు సాయంత్రం 5.30 గంటలకు విజయవాడలో బయలుదేరి రాత్రి 11 గంటలకు విశాఖకు చేరుతుంది. వారంలో 5 రోజులు (గురువారం, ఆదివారం తప్ప) మాత్రమే నడిచే ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు స్టేషన్ల మాత్రమే ఆగుతుంది.