జగన్ ఇంటి ముందు  ఉద్యోగులు ధర్ణా

జగన్ ఇంటి ముందు  ఉద్యోగులు ధర్ణా

అమరావతి:  తాడేపల్లిలోని  ముఖ్యమంత్రి జగన్ నివాసం ఎదుట శుక్రవారం బీమా సహాయ వాణి  ఉద్యోగులు ఆందోళన చేసారు.  రాష్ట్ర వ్యాప్తంగా వెలుగు పథకం దాదాపు వేయి మందికి  పైగా ఉద్యోగులు 15 గత ఏళ్లకు పైగా పని చేస్తున్నారు. కనీస వేతనాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రతను కల్పించి  జీతాలను పెంచాలని  డిమాండు చేశారు. న్యాయం చేస్తామని పాదయాత్ర సమయంలో  ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని జగన్‌కు విన్నవించారు.  జగన్ ను కలిసేందుకు భద్రతా సిబ్బంది అనుమతి నిరాకరించటంతో వారంతా అక్కడే బైఠాయించి, నినాదాలు రాసిన అట్టల్ని పట్టుకుని, నినదించారు. కళ్యాణ మిత్రలను తొలగిస్తారనే ప్రచారం జరుగుతున్నందున వారు కూడా గత రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos