చెట్టు నరికినందుకు రూ.1,000 జరిమానా..

చెట్టు నరికినందుకు రూ.1,000 జరిమానా..

 చెట్టును కొట్టినందుకు వ్యక్తికి సిద్దపేట మున్సిపాలిటి రూ.1,000 జరిమానా విధించింది.సిద్దిపేటకు చెందిన వీరేశం అనే వ్యక్తి హైదరాబాద్ వెళ్లే రోడ్డులో కలెక్టర్ క్యాంప్ కార్యాలయం వద్ద ఉన్న చెట్టును నరుకుతుండడాన్ని గమనించిన పురపాలక అధికారులు వీరేశాన్ని అడ్డుకొని చెట్టును నరికినందుకు రూ.1,000 జరిమానా విధించారు.ఊహించని పరిణామమంతో బిత్తరపోయిన వీరేశం జరిమానా ఎందుకని ప్రశ్నించగా హరితహారం చెట్టును నరికేసినందుకంటూ బదులిచ్చారు.దీంతో విధి లేక వీరేశం రూ.1,000 జరిమాన చెల్లించి అక్కడి నుంచి ఉసూరుమంటూ ఇంటికి వెళ్లాడు.మరోసారి ఎక్కడైనా చెట్లు నరికితే జైలుకు పంపిస్తామంటూ హెచ్చరించిన అధికారులు చెట్లు నరికితే ఎవరికైనా ఇదే శిక్ష వర్తిస్తుందంటూ హెచ్చరించారు..వీరేశానికి అధికారులు ఇచ్చిన జరిమానాకు సంబంధించి కాగితం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos