గత ఎన్నికల్లో జనసేన తరపున ఎమ్మెల్యేగా పాడేరు నియోజకవర్గం నుండి బరిలోకి దిగిన పసుపులేటి బాలరాజు జనసేన పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. విశాఖపట్నం జిల్లా పాడేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన బాలరాజు కొంతకాలంగా జనసేన పార్టీకి దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో ఏ మాత్రం పాల్గొనటం లేదు. ఇక తాజాగా జనసేన విశాఖలో నిర్వహించ తలపెట్టిన లాంగ్ మార్చ్కు సైతం దూరంగానే ఉండడానికి నిర్ణయించుకున్నట్లు సమచారం.జనసేన చేపట్టిన లాంగ్ మార్చ్ నిర్వహణ కోసం విశాఖలో ఏర్పాట్లపై నాదెండ్ల మనోహర్, నాగబాబు నిర్వహించిన సమీక్షా సమావేశంలో కూడా బాలరాజు పాల్గొనలేదు. దీంతో బాలరాజు జనసేన పార్టీకి రాజీనామా చేస్తారనే వార్తలు ఊపందుకున్నాయి.