షిండే బలం పెరుగుతోంది

షిండే బలం పెరుగుతోంది

గౌహతి : శివసేన తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే పక్షాన నిలిచిన ఎమ్మెల్యేల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం షిండే శిబిరంలో మొత్తం 42 మంది ఎమ్మె ల్యేలున్నారు. వీరిలో 35 మంది శివసేనకు చెందిన వారు. ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు. షిండే బల ప్రదర్శన వీడియో గురువారం విడుదలైంది. ఈ సందర్భంగా ఏక్నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మూడింట రెండొంతుల కంటే అధికంగా ఎమ్మెల్యేలను కలిగిన తమ శిబిరమే అసలైన శివసేన. గవర్నర్ ముందు బల ప్రదర్శన కూ సిద్ధంగా ఉన్నాం. నిన్నటిదాకా 38 మంది ఎమ్మెల్యేలే నాన వెంట ఉన్నారు. గురువారం ఉదయం మరో నలుగురు ఎమ్మెల్యేలు నా శిబిరంలో చేరార’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos