పవార్‌కు సామ్నా సలాం

పవార్‌కు సామ్నా సలాం

ముంబై: మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో శరద్పవార్ సారథ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుని సత్తా చాటినందుకు శివసేన పత్రిక – సామ్నా ప్రశంసల్లో ముంచెత్తింది. ఎన్నికల ఫలితాల కథనంలో కాంగ్రెస్, ఎన్సీపీలకు సముచిత స్థానాన్ని కల్పించింది. ప్రత్యేకంగా పవార్ గురించి రాసింది. భాజపాపై విమర్శల వర్షాన్ని కురిపించింది ‘ఫిరాయింపుదార్లతో ఎన్నికల్లో గెలవాలంటే కుదరదు. సతారాలో ఉదయ్రాజే భోస్లే భారీ ఓటమి చవి చూడటంతో ఈ విషయం మరో సారి రుజువైంది’ అని చురక అంటించింది. భాజపా, శివసేన 162 స్థానాలను గెలుచుకున్నాయి. శివసేన కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో గతం కంటే ఎక్కువ సీట్లు తెచ్చుకుంది. దీంతో ఆ పార్టీ యువనేత ఆదిత్య ఠాక్రేకు సీఎం పదవి ఇవ్వాలని పట్టుబడుతోంది. మరోవైపు ముఖ్యమంత్రి పదవీ కాలాన్ని చెరోసగం పంచుకునే ప్రతిపాదన కూడా తెర మీదకు వచ్చింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos