మొండి చేయి చూపిన కేంద్రం

మొండి చేయి చూపిన కేంద్రం

న్యూ ఢిల్లీ:లోక్‌సభలో శుక్రవారం ప్రవేశ పెట్టిన బడ్జెట్ నిరాశా దాయకమని వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఇక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడారు. అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదని ఆక్రోశించారు.  కేంద్ర ప్రభుత్వం  మొండిచేయి చూపిందని విమర్శించారు. ఈ బడ్జెట్ లో అదనంగా ఇచ్చిందేమీ లేదని, ఎన్ని నిధులు కేటాయిస్తున్నారనే దానిపై స్పష్టత లేదని తప్పుబట్టారు.  విభజన చట్టంలోని అంశాల గురించి పెదవి విప్పలేదని దుయ్యబట్టారు. , విశాఖ, విజయవాడ మెట్రో నిధుల విషయంలో అన్యాయం జరిగిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోలేదని, పోలవరం, అమరావతి నిర్మాణంపై నిధుల ప్రస్తావనే లేదన్నారు. శూన్య  బడ్టెట్ వ్యవసాయంపై స్పష్టత లేదని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు ఏ పోరాటానికైనా తాము సిద్ధమన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని పార్లమెంట్ లో ప్రశ్నిస్తామని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos