రూ.౩౦ లక్షల ఖర్చుతో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు

రూ.౩౦ లక్షల ఖర్చుతో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు

హోసూరు : కృష్ణగిరి జిల్లా సూలగిరి యూనియన్‌లోని మూడు గ్రామాలలో రూ.30 లక్షల ఖర్చుతో నీటి శుద్ధీకరణ ప్లాంట్ల ఏర్పాటుకు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. మారుతి నగర్, మాడివాలం, బి.కురుబరపల్లి గ్రామాల ప్రజలకు రక్షిత మంచి నీటిని అందించడానికి సూలగిరి యూనియన్ చైర్‌పర్సన్ లావణ్య హేమానాథ్ చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి బాలకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మూడు గ్రామాల ప్రజలకు రక్షిత మంచి నీటిని అందించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు లావణ్య హేమానాథ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బాలకృష్ణారెడ్డితో పాటు హోసూరు యూనియన్ చైర్‌పర్సన్ శశి వెంకటస్వామి, బేరికే పంచాయతీ మాజీ అధ్యక్షులు శరవణన్, చిన్న అబ్బయ్య, ఎడిఎంకె పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos