న్యూఢిల్లీ: హింసకు పాల్పడేలా జనాలను రెచ్చ గొట్టడం, ఆస్తుల దహనాలకు పాల్పడడం నాయకత్వం అనిపించుకోదని భారత పదాతి దళపతి జనరల్ బిపిన్ రావత్ గురువారం ఇక్కడ వ్యాఖ్యానించారు. ‘‘ప్రజలను సక్రమమైన మార్గంలో నడి పించలేని వారు నాయ కులు కాదు. విశ్వ విద్యాలయాలు, కళాశాలల్లో, ప్రజలను నడిపిస్తున్న తీరే దీనికి నిదర్శనం. మన పట్టణాలు, నగరాల్లో హింసకు పాల్పడేలా, ఆస్తుల దహనాలకు పాల్పడేలా ప్రజలను వారు రెచ్చగొడుతున్నారు. ఇది నాయకత్వ లక్షణం కానే కాద’న్నారు.