రోగిపై వైద్యుల అత్యాచారం

రోగిపై వైద్యుల అత్యాచారం

లక్నో : ప్రయాగ్ రాజ్ స్వరూప్ రాణి నెహ్రు ఆసుపత్రి (ఎస్ఆర్ఎన్)లో పేగు వ్యాధి చికిత్స చేయించుకుంటున్న 20 ఏళ్ల యువతి పై నలుగురువైద్యులు అత్యాచారానికి పాల్పడ్డారు. చివరకు చికిత్స పొందుతూ మంగళవారం ప్రాణాలు కోల్పోయింది. జూన్ 3న బాధితురాలి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేసాడు. అయితే ఆమె చనిపోయిన తర్వాత ప్రయాగ్రాజ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రాథమిక విచారణ వల్ల ఎఫ్ఐఆర్కు దాఖలులో ఆలస్యమైందని పోలీసులు చెప్పారు. ఈ దుర్మార్గం తమ దృష్టికి రాలేదని ఆసుపత్రి యాజమాన్యం పేర్కొంది. లైంగిక దాడి ఆరోపణలను ఖండించారు. నలుగురు వైద్యులపై కేసు నమోదైనప్పటికీ ఇప్పటి వరకు ఒక్కరినీ కూడా అరెస్టు చేయలేదు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడుతున్నామని సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ తెలిపారు. విచారణకు ప్రయాగ్రాజ్ వైద్యాధికారికీ అనుమతించామని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos