కోహ్లీ, టీం ఇండియా స్థానాలు పదిలం

కోహ్లీ, టీం ఇండియా స్థానాలు పదిలం

హైదరాబాద్: ఐసీసీ సోమవారం విడుదల చేసిన టెస్టు ర్యాంకుల్లో భారత క్రికెట్ జట్టుతో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ తమ అగ్రస్థానాలను మరింత పదిలం చేసుకున్నారు. 116 పాయింట్లతో టీమిండియా టెస్టు ర్యాంకుల్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆసీస్ గడ్డపై టీమిండియా టెస్టు సిరిస్ విజయాన్ని సొంతం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించిన భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ చేతేశ్వర్ పుజారా మూడో స్థానాన్ని సొంతం చేసుకోగా… యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ 17వ స్థానంలో నిలిచాడు. బౌలర్ల విషయానికి వస్తే దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. భారత బౌలర్లలో అశ్విన్ ఐదో స్థానంలో కొనసాగుతుండగా… రవీంద్ర జడేజా తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక, ఆసీస్ గడ్డపై అత్యధిక వికెట్లు తీసిన బుమ్రా 711 పాయింట్లతో 15వ స్థానంలో నిలిచాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos