ఎన్ని అన్యాయాలు చేసినా పవన్‌ కళ్యాణ్‌కు ఆయనే దేవుడు

ఎన్ని అన్యాయాలు చేసినా పవన్‌ కళ్యాణ్‌కు ఆయనే దేవుడు

అమరావతి: ఏపీలో వాలంటీర్లపై ఆంక్షలకు టీడీపీ అధినేత చంద్రబాబే కారణమని ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి మండి పడ్డారు. చంద్రబాబు హయాంలో పెన్షన్ల పంపిణీకి రెండు మూడు రోజుల సమయం పట్టేదని గుర్తు చేశారు. పింఛన్ కోసం వెళ్లి ఎంతోమంది చనిపోయారని విమర్శించారు. కానీ ఇప్పుడు పెన్షనర్లకు వాలంటీర్లు దేవుళ్లలా కనిపించారని అన్నారు. కానీ ఎన్నికల వేళ వాలంటీర్లపై చంద్రబాబు కుట్రలు చేశారని మండిపడ్డారు. వాలంటీర్ల సేవలను ఓర్వలేక.. నిమ్మగడ్డ రమేశ్తో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించి చంద్రబాబు అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా సరే ఒక పార్టీ పెట్టి.. మేనిఫెస్టోను ప్రజల ముందుకు తీసుకెళ్లి ముఖ్యమంత్రి అవుతారని.. కానీ చంద్రబాబు అలా కాదని పోసాని కృష్ణమురళి అన్నారు. చంద్రబాబు పార్టీ పెట్టలేదని.. ఎన్టీఆర్ పెట్టిన టీడీపీని కబ్జా చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి పదవి కోసం ఎన్టీఆర్ను.. రాజకీయ భవిష్యత్ కోసం వంగవీటి రాధాను చంపారని మండిపడ్డారు. జగన్ను రాజకీయ సమాధి చేయడం కోసం కూడా కుట్రలు చేస్తున్నారని.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ను లొంగదీసుకున్నారని ఆరోపించారు. కాపులను రౌడీలు, గుండాలు అని తిట్టిన చంద్రబాబు ఇప్పుడు కాపులను లొంగదీసుకోవడం కోసం పవన్ కళ్యాణ్ను అడ్డం పెట్టుకున్నారని విమర్శించారు. చంద్రబాబు ఇలా ఎన్ని అన్యాయాలు చేసినా పవన్ కళ్యాణ్కు మాత్రం దేవుడే అని ఎద్దేవా చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos